మహిళపై దాడి ఘటనలో చర్యలకు సీఎం ఆదేశం

అమరావతి : గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై సీరియ‌స్ గా స్పందించారు. సంఘ‌ట‌న‌ తనను తీవ్రంగా కలచి వేసిందని శ‌నివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి సంఘటనలకు సమాజంలో తావు లేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వెల్ల‌డించారు.

ఈ ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు నారా చంద్ర‌బాబు నాయుడు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో ఎంత‌టి వారైనా ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

  • Related Posts

    హైద‌రాబాద్ స్కై రూట్ కు ప్ర‌ధాని మోదీ కంగ్రాట్స్

    న్యూఢిల్లీ : ఏపీలోని శ్రీ‌హ‌రి కోట వేదిక‌గా దేశంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా త‌యారు చేసిన ఉప‌గ్ర‌హం శ‌నివారం అధికారికంగా అంత‌రిక్షంలోకి వెళ్లింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అభినందన‌ల‌తో ముంచెత్తారు. భార‌త్ త‌న స‌త్తా ఏమిటో…

    పొగాకు రైతుల‌కు కనీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాలి

    అమ‌రావ‌తి : ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన పొగాకు పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్‌లో గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది వేలం ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని త‌న‌ను క‌లిసిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *