జ‌గ‌న్ దుష్ప్ర‌చారం ప‌ల్లా ఆగ్ర‌హం

Spread the love

అబ‌ద్దాల‌కు కేరాఫ్ వైసీపీ అధ్య‌క్షుడు

అనంత‌పురం జిల్లా : అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ స‌భ బిగ్ స‌క్సెస్ అయ్యింద‌న్నారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం చేస్తోందని చెప్పారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో 90 శాతం అమ‌లు చేశామ‌ని, అందుకే ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చామ‌ని చెప్పారు. జగన్ తన పాలనలో ప్రజల్లోకి రాలేద‌న్నారు. ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు చేయడం తప్ప ఆయనకు మరే అజెండా లేదన్నారు. మూడు రాజధానులంటూ అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేద‌న్నారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు.

విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అవుతోందని గగ్గోలు పెడుతూనే కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చుకోలేక పోయారని మండిప‌డ్డారు. కానీ కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో రూ.14 వేల కోట్లు తెచ్చి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను 80 శాతం సామర్థ్యంతో నడుస్తున్న స్థితికి తీసుకు వచ్చేలా చేసింద‌న్నారు. అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్రపై జగన్ ఫేక్ ప్రచారాలు మాత్రమే చేస్తున్నారు అని విమర్శించారు. ఎన్టీఆర్ వేసిన బీజాలు, చంద్రబాబు హయాంలో ఫలితాలు ఇచ్చాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్ తో అనంతపురం హార్టికల్చర్ హబ్ గా మారింద‌న్నారు. చంద్రబాబు విజన్‌తో కియా మోటార్స్ రాకతో ఆటోమొబైల్ కు కేరాఫ్ గా మారింది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు.

  • Related Posts

    కేంద్ర స‌ర్కార్ కు టీడీపీ పూర్తి మ‌ద్ద‌తు

    Spread the love

    Spread the loveమహిళా సాధికారత దిశగా అడుగులు న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట ప‌ట్టారు. పార్ల‌మెంట్ లో మూడు చారిత్రాత్మ‌క‌మైన బిల్లులు ప్ర‌వేశ పెట్టేందుకు శ్రీ‌కారం చుట్టారు . ఈ సంద‌ర్బంగా…

    రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడ‌ల్ ప‌నికి రాదు

    Spread the love

    Spread the loveపార్ల‌మెంట్ లో బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ తేజ‌స్వి సూర్య‌. గురువారం పార్ల‌మెంట్ సాక్షిగా ఆగ్ర‌హం వ్య‌క్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *