తిన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ టీఆర్పీ

Spread the love

హైద‌రాబాద్ వేదిక‌గా ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ

హైద‌రాబాద్ : చింతపండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ముందుగా చెప్పిన‌ట్టుగానే హైద‌రాబాద్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బుధ‌వారం తాజ్ హోట‌ల్ లో జ‌రిగిన కీల‌క కార్య‌క్ర‌మంలో బ‌హుజ‌నుల కోసం ప్ర‌త్యేకంగా పార్టీ ఉండాల‌ని తాము కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌సంగించారు. రాష్ట్రంలో గ‌త కొన్నేళ్లుగా కొన్ని కులాలే అధికారాన్ని అనుభ‌విస్తున్నాయ‌ని ఆరోపించారు. అయితే రెడ్లు లేదా వెల‌మ‌లు నిన్న‌టి దాకా పాలించార‌ని, జ‌నాభా ప‌రంగా అత్య‌ధికంగా జ‌నాభా క‌లిగిన బ‌హుజ‌నుల‌కు ఎలాంటి ప‌వ‌ర్ లేకుండా పోయింద‌న్నారు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ చెప్పిన‌ట్టుగానే పొలిటిక‌ల్ ఎంట్రీ ఈజ్ ద మాస్ట‌ర్ కీ అన్న‌ట్టుగానే తాము బీసీల‌కు రాజ్యాధికారం రావాల‌నే ఉద్దేశంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టామ‌న్నారు. బీసీలు అన్ని రంగాల‌లో వెనుకబాటు త‌నానికి గుర‌య్యార‌ని వాపోయారు. మొత్తం రాష్ట్ర జ‌నాభాలో కేవ‌లం 6 లేదా 7 శాతం క‌లిగిన వారే ఉన్న‌త ప‌ద‌వులు, చ‌ట్ట స‌భ‌ల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ఉన్నార‌ని ఆరోపించారు. అందుకే త‌మ పార్టీ రాజ‌కీయాల‌లో ప‌ద‌వుల‌కు దూరంగా ఉన్న వారిని భాగ‌స్వామ్యం చేయాల‌నే ఉద్దేశంతో పార్టీ పెట్టామ‌న్నారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌.

  • Related Posts

    చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత‌ అమ‌రావ‌తి : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయ‌ల‌సీమ‌ను కావాల‌ని నాశ‌నం చేశాడంటూ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రజా…

    తెలుగు ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ఉండేలా చూడాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *