తిన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ టీఆర్పీ

Spread the love

హైద‌రాబాద్ వేదిక‌గా ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ

హైద‌రాబాద్ : చింతపండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ముందుగా చెప్పిన‌ట్టుగానే హైద‌రాబాద్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బుధ‌వారం తాజ్ హోట‌ల్ లో జ‌రిగిన కీల‌క కార్య‌క్ర‌మంలో బ‌హుజ‌నుల కోసం ప్ర‌త్యేకంగా పార్టీ ఉండాల‌ని తాము కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌సంగించారు. రాష్ట్రంలో గ‌త కొన్నేళ్లుగా కొన్ని కులాలే అధికారాన్ని అనుభ‌విస్తున్నాయ‌ని ఆరోపించారు. అయితే రెడ్లు లేదా వెల‌మ‌లు నిన్న‌టి దాకా పాలించార‌ని, జ‌నాభా ప‌రంగా అత్య‌ధికంగా జ‌నాభా క‌లిగిన బ‌హుజ‌నుల‌కు ఎలాంటి ప‌వ‌ర్ లేకుండా పోయింద‌న్నారు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ చెప్పిన‌ట్టుగానే పొలిటిక‌ల్ ఎంట్రీ ఈజ్ ద మాస్ట‌ర్ కీ అన్న‌ట్టుగానే తాము బీసీల‌కు రాజ్యాధికారం రావాల‌నే ఉద్దేశంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టామ‌న్నారు. బీసీలు అన్ని రంగాల‌లో వెనుకబాటు త‌నానికి గుర‌య్యార‌ని వాపోయారు. మొత్తం రాష్ట్ర జ‌నాభాలో కేవ‌లం 6 లేదా 7 శాతం క‌లిగిన వారే ఉన్న‌త ప‌ద‌వులు, చ‌ట్ట స‌భ‌ల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ఉన్నార‌ని ఆరోపించారు. అందుకే త‌మ పార్టీ రాజ‌కీయాల‌లో ప‌ద‌వుల‌కు దూరంగా ఉన్న వారిని భాగ‌స్వామ్యం చేయాల‌నే ఉద్దేశంతో పార్టీ పెట్టామ‌న్నారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు

    Spread the love

    Spread the loveరెండు రోజుల పాటు క్యాంపెయిన్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూట‌మి త‌ర‌పున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేయానున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నిక‌లకు సంబంధించి…

    అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    Spread the love

    Spread the loveకాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *