
ఛాంపియన్ నీరజ్ చోప్రాను అధిగమించిన జూవెలిన్ స్టార్
జపాన్ : జపాన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో సత్తా చాటాడు భారత దేశానికి చెందిన జూవెలిన్ స్టార్ సచిన్ యాదవ్ . తను మరో భారత స్టార్ నీరజ్ చోప్రాను దాటేయడం సంచలనంగా మారింది. యావత ప్రపంచం విస్తు పోయింది. గురువారం జపాన్లోని టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025 ఫైనల్లో భారత జావెలిన్ త్రో స్టార్ సచిన్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. సచిన్ యాదవ్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 85.16 మీటర్లతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
నీరజ్ చోప్ర, అర్షద్ నదీప్ మధ్య జరిగిన భారతదేశం-పాకిస్తాన్ ద్వంద్వ పోరాటం చుట్టూ ఎక్కువ చర్చ జరుగుతుండగా, నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా యుద్ధాన్ని గెలిచింది సచినే. 25 ఏళ్ల ఈ యువకుడు ఫైనల్లో తన తొలి ప్రయత్నంలోనే 86.27 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ భారీ త్రోతో నీరజ్ (8వ స్థానం) , అర్షద్ (10వ స్థానం) ఇద్దరినీ అధిగమించాడు. ఇది అతని ఉత్తమ ప్రయత్నంగా మారింది, ప్రపంచ ఛాంపియన్షిప్లలో నాల్గవ స్థానంలో నిలిచేందుకు అతనికి సహాయపడింది.
ఇదిలా ఉండగా సచిన్ యాదవ్ 1999 అక్టోబర్ 25న భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని ఖేక్రాలో జన్మించాడు. మొదట్లో ఫాస్ట్ బౌలర్ కావాలనే మక్కువతో సచిన్ 19 సంవత్సరాల వయసులో జావెలిన్ త్రోకు మారాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్న సచిన్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, పేస్ స్పియర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రాను ఆరాధిస్తాడు. సచిన్ 2025 ఆసియా ఛాంపియన్షిప్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో డెహ్రాడూన్లో జరిగిన 38వ జాతీయ క్రీడల్లో అతను 84.39 మీటర్ల మీట్ రికార్డ్ త్రోతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.