కంగ్రాట్స్ టీం ఇండియా : కొలుసు పార్థ‌సార‌థి

Spread the love

సంజూ శాంస‌న్ ఆడిన తీరు అద్బుతం

అమ‌రావతి : ఏపీ స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. టీ-20 వరల్డ్ కప్ సూపర్ 8 చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టుపై ఘన విజయాన్ని సాధించిన టీమ్ ఇండియాకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ చాటిన సంజు శ్యామ్సన్ కి ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు మంత్రి . శ్యామ్సన్ ఆడిన తీరు యావత్ దేశం గర్వించే విధంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. టీమ్ ఇండియా జట్టు ప్రతిభను చూసి దేశం మొత్తం మురిసి పోతోందని పేర్కొన్నారు కొలుసు పార్థ‌సార‌థి.

సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన టీమ్ ఇండియా ఈనెల 5న ఇంగ్లండ్ మీద కూడా ఘన విజయాన్ని నమోదు చేసి ఫైనల్స్ కి చేరాలని, ఫైనల్స్ లోనూ ఘన విజయాన్ని సాధించి మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని ప్రపంచం మురిసేలా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో భార‌త జ‌ట్టు విండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 195 ప‌రుగులు చేసింది. అనంత‌రం భార‌త్ 19.2 ఓవ‌ర్ల‌లో 198 ర‌న్స్ చేసింది. శాంస‌న్ ఒక్క‌డే 50 బంతులు ఆడి 12 ఫోర్లు 4 సిక్సులతో 97 ప‌రుగులు చేశాడు. భార‌త్ ను సెమీస్ కు చేర్చాడు.

  • Related Posts

    డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

    Spread the love

    Spread the loveమ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతోంది. ర‌జిత్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని ఈ జ‌ట్టు ఊహించ‌ని విధంగా గెలుస్తూ…

    క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ తిరుప‌తి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *