శాంస‌న్ ఆడిన ఇన్నింగ్స్ అద్బుతం : అమీర్

నిన్న టీం ఇండియాపై షాక్ కామెంట్స్
పాకిస్తాన్ : ఎట్టి ప‌రిస్థితుల్లో టీం ఇండియా సెమీ ఫైన‌ల్ కు వెళ్ల‌ద‌ని, వెస్టిండీస్ తో త‌ప్ప‌కుండా ఓడి పోతుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెట‌ర్ మొహ‌మ్మ‌ద్ అమీర్. కానీ ఆయ‌న అంచ‌నాలు పూర్తిగా త‌ప్పాయి. భార‌త జ‌ట్టు కోల్ క‌తా వేదిక‌గా విండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ద‌ర్జాగా సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 195 ప‌రుగులు చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన టీం ఇండియా ఊహించ‌ని రీతిలో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. మొద‌టి నుంచి ఆఖ‌రి ఓవ‌ర్ దాకా నిలిచే ఉన్నాడు మైదానంలో స్టార్ ఓపెన‌ర్ కేర‌ళ‌కు చెందిన సంజూ శాంస‌న్ .

త‌ను 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 4 సిక్సుల‌తో రెచ్చి పోయాడు. 97 ప‌రుగులు చేసి ఇండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ సంద‌ర్బంగా మొహ‌మ్మ‌ద్ అమీర్ స్పందించాడు. త‌ను ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అంటూ కితాబు ఇచ్చాడు. సంజు సామ్సన్ తన జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. నేను IPLలో కూడా అతని బ్యాటింగ్ చూశాను కానీ అధిక ఒత్తిడి, నాకౌట్ ఆటలో అతను ఆడిన అత్యుత్తమ ఆట ఇది. దానికి తగిన చోట క్రెడిట్ ఇవ్వాలని పేర్కొన్నాడు. త‌ను అన్ని ప్రశంసలు అందుకునేందుకు అర్హుడంటూ కితాబు ఇచ్చాడు అమీర్.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *