సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా స‌హ‌క‌రించాలి


ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

అస్ట్రేలియా : సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా స‌ర్కార్ స‌హ‌క‌రించాల‌ని కోరారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సీఫుడ్ వాణిజ్యంలో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం గురించి గత రెండు రోజులుగా తాను చర్చలు జరుపుతూ వ‌చ్చార . ఈరోజు స్థిరమైన ఆక్వా కల్చర్ ట్రేడ్ నెట్‌వర్కింగ్‌లో భాగస్వామ్యాలను చర్చించడానికి సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) CEO వెరోనికా పాపాకోస్టా మరియు ఎంగేజ్‌మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెహెర్‌లను కలిశారు. 2024–25లో USD 7.4 బిలియన్లు (₹66,000 కోట్లు) విలువైన భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 60%+ వాటాను కలిగి ఉందన్నారు. ఆస్ట్రేలియన్ సముద్ర ఆహారాన్ని ప్రోత్సహించడానికి, దానిని ప్రీమియం సమర్పణగా మార్చడానికి వారు ‘గ్రేట్ ఆస్ట్రేలియన్ సీఫుడ్’ అనే బ్రాండ్‌ను సృష్టించారని తెలిపారు.

ఈ సంద‌ర్బంగా శిక్ష‌ణ , మార్కెటింగ్ స‌దుపాయాలు కూడా క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు మంత్రి నారా లోకేష్. రొయ్య‌ల ప‌రంగా పెద్ద ఎత్తున వ్యాపార‌, వాణిజ్యం కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ప్ర‌ధానంగా అత్య‌ధికంగా ఆదాయ వ‌న‌రుగా ఇది మారింద‌న్నారు. స‌ర్కార్ అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తోంద‌ని తెలిపారు మంత్రి. కాగా సుంకాల విధింపు కార‌ణంగా ఎక్కువ‌గా రొయ్య‌ల ఇండ‌స్ట్రీపై అత్య‌ధికంగా ప్ర‌భావం చూపిస్తోంద‌న్నారు నారా లోకేష్‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *