ఏపీ మీడియా అకాడమీని బ‌లోపేతం చేయాలి

Spread the love

స‌మాచార సంచాల‌కుల‌ను కోరిన ఏపీయూడ‌బ్ల్యూజే

విజ‌య‌వాడ : ఇబ్బందుల్లో ఉన్న పాత్రికేయులను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను పటిష్టం చేయాల‌ని ఏపీ స‌మాచార శాఖ సంచాల‌కులు విశ్వ‌నాథ‌న్ ను కోరారు ఏపీయూడ‌బ్ల్యూజే నేత‌లు కోరారు. అవసరమైన బడ్జెట్ లు కేటాయించాలని విన్న‌వించారు. అకాడమీ నియమావళి ప్రకారం వివిధ కార్యకలాపాలు చేపట్టడానికి వీలుగా గవర్నింగ్ కౌన్సిల్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో నియమించాలని విన్నవించారు. వృత్తిలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు, ఫోటో జర్నలిస్టులను, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందిని ప్రోత్సహించేందుకు వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసి ఈమధ్య నిలిపివేసిన రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టు పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు . అలాగే సుదీర్ఘకాలం వృత్తిలో సేవలు అందించిన సీనియర్ పాత్రికేయులను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించే ఆన‌వాయితీని తిరిగి ప్రారంభించాలని అన్నారు.

పాత్రికేయ వృత్తిలో శిక్షణ నైపుణ్యం పెంపొందించు కోవడానికి వీలుగా ఉన్నత విద్యాభ్యాసానికి వృత్తి పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయాలని సంచాలకులను విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కార్డుల పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి, పథకం అమలను పర్యవేక్షించడానికి వీలుగా సమాచార శాఖ , ఆరోగ్యశ్రీ ట్రస్ట్, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో ఒక త్రైపాక్షగా కమిటీని నియమించాలని సూచించారు. 2016లో ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేసి గత ప్రభుత్వం నిలిపివేసిన వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు . వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్ట్ కేటగిరీల సిబ్బందికి వేజ్ బోర్డు సిఫారసుల ప్రకారం వేతనాలు అమలు చేయడానికి వీలుగా కార్మిక శాఖ ద్వారా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.

వేజ్ బోర్డు సిఫార్సులు పర్యవేక్షించడానికి చట్ట ప్రకారం గతంలో మాదిరిగా త్రైపాక్షగా కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన, మీడియా సంస్థలపైన దాడులు అరికట్టడానికి మహారాష్ట్ర తరహాలో మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని తేవాలని విన్నవించారు. కరోనా కాలంలో రద్దయిన జర్నలిస్టుల రైల్వే రాయితీ ప్రయాణ సదుపాయాన్ని పునరుద్ధరించదానికి కేంద్రంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు .చిన్న, మధ్య తరహా పత్రికల మనుగడ కొనసాగటానికి వీలుగా ఆయా సంస్థలకు రొటేషన్ పద్ధతి పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రచార ప్రకటనలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు . దేశంలో పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా వయోభారంతో వృత్తి నుండి విరమించుకున్న వయోధిక పాత్రికేయులకు పింఛన్ సదుపాయాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

  • Related Posts

    రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

    Spread the love

    Spread the loveభ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి అమ‌రావ‌తి : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హోం…

    రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *