ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్

పుకార్లను నమ్మవద్దు.. ప్రశాంతంగా ఉండండి

అమ‌రావ‌తి : ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. సీఎం టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దని సూచించింది ఏపీఐఎండీ. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాల‌ని , వాతావరణ హెచ్చరికలు కోసం SMS లను గమనించాల‌ని పేర్కొంది. రేడియో/టీవీ న్యూస్ చూడండి, వార్తాపత్రికలు చదవండి. మీ పత్రాలు/సర్టిఫికెట్స్ మరియు విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు/కవర్ లో ఉంచాల‌ని తెలిపింది. ఖాళీ గదిలో ఉండటానికి ప్రయత్నించండి. అదేవిధంగా వస్తువులు కదలకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. భద్రత మరియు మనుగడ కోసం అవసరమైన వస్తువులతో “అత్యవసర వస్తు సామగ్రిని” సిద్ధం చేసుకోండి. మీ ఇంటిని ముఖ్యంగా పైకప్పును భద్రపరచుకోండి, ఏమైనా మరమ్మతులు ఉంటే చేపట్టండి, ఇంట్లో పదునైన వస్తువులను వదులుగా ఉంచవద్ద‌ని సూచించింద‌.ఇ

పశువులు / జంతువులను పూర్తిగా వాటికి కట్టిన తాడును విప్పి వాటిని వదిలి వేయండి . తుఫాను ఉప్పెన / ఆటుపోట్ల హెచ్చరిక లేదా వరదలు వచ్చినప్పుడు, మీ సమీప సురక్షితమైన ఎత్తైన భూమి / సురక్షితమైన ఆశ్రయం పొందండి. దానికి సురక్షితమైన మార్గం ను తెలుసుకోండి. కనీసం ఒక వారం పాటు ఉండటానికి తగినంత ఆహారం, నీరు నిల్వలను సిద్ధం చేసుకోండి. మీ కుటుంబం కోసం, సంఘం కోసం నిర్వహించే కృత్రిమ విపత్తులు (మాక్ డ్రిల్స్) / శిక్షణ తరగతులలో పాల్గొనండి. స్థానిక అధికారుల అనుమతితో మీ ఇంటి దగ్గర చెట్ల కొమ్మలను కత్తిరించండి. తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసి వేయండి. ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెంటనే వెళ్ళండి.

ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షలను తీసివేయండి. తలుపులు, కిటికీలు మూసివేసి ఉంచండి. మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకోండి. భవనం కూలి పోవటం జరుగుతుంటే, దుప్పట్లు, రగ్గులు లేదా దుప్పట్లతో లేదా బలమైన టేబుల్ లేదా బెంచ్ కిందకు దూరడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *