వ‌డ్డెర సామాజిక వ‌ర్గీయుల‌కు అధిక ప్రాధాన్య‌త

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి సవిత. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ వడ్డెర నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించామన్నారు. వడ్డెరలకు క్వారీ కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లతో పాటు సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ కూడా అందిస్తామన్నారు. వడ్డెరలను ఎస్టీలో చేర్చే అంశం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉందన్నారు. వడ్డెరలను అన్ని విధాలా అభివృద్ధి చెందేలా సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి వెల్లడించారు.

వడ్డెరలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలంటే విద్య తప్పనిసరి అని సవిత స్ప‌ష్టం చేశారు. తమ బిడ్డలను ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహించాలని సూచించారు. వడ్డెర సామాజిక వర్గీయుల వినతి మేరకు తన తండ్రి పేరు మీద ఉన్న ఎస్ఆర్ఆర్ ట్రస్టు ద్వారా సొంత నిధులతో గోరంట్ల మండల కేంద్రంలో వడ్డె ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు అంజనప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షులు శేఖర్ సాహు, టీడీపీ సీనియర్ నాయకులు దేవళ్ల మురళి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో వడ్డెర సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *