శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి స‌న్నిధిలో లోకేష్

Spread the love

అయ్య‌ప్ప భ‌క్తుల పూజ‌లో పాల్గొన్న మంత్రి

అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్బంగా అయ్య‌ప్ప భ‌క్తులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. పెద్ద ఎత్తున అయ్య‌ప్ప స్వామి మాల‌లు ధ‌రించారు. వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీలతో పాటు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంత‌రం అయ్య‌ప్ప స్వామి మాలాధార‌ణ చేప‌ట్టిన భ‌క్తుల‌కు పెద్ద ఎత్తున మ‌హా ప్ర‌సాదం పంపిణీ చేశారు. స్వ‌యంగా పాల్గొన్నారు మంత్రి. వారికి పండ్లు, ఫ‌ల‌హారాలు, ఇత‌ర ప్ర‌సాదాల‌ను అందించారు. అయ్య‌ప్ప స్వామి క‌రుణ క‌టాక్షం అయ్య‌ప్ప స్వాముల‌కు క‌ల‌గాల‌ని ఆ దేవుడిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు లోకేష్. త‌మ ప్ర‌భుత్వం ఆల‌యాల అభివృద్దికి కృషి చేస్తోంద‌ని చెప్పారు.

  • Related Posts

    ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

    Spread the love

    Spread the loveఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వ‌ర్యంలో మార్చి 9న నిర్వ‌హించ‌నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

    వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి

    Spread the love

    Spread the loveప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *