డిప్యూటీ సీఎంను క‌లిసిన ఎస్పీ తుషార్ డూడి

రెండు రోజుల పాటు తిరుప‌తిలోనే ప‌వ‌న్ మ‌కాం

చిత్తూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ఎస్పీ తుషార్ డూడి. ఆయ‌న శ‌నివారం , ఆదివారం తిరుప‌తి, చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇవాళ మంగ‌ళం లోని అట‌వీశాఖ ప‌రిధిలోని ఎర్ర చంద‌నం గోడౌన్ల‌ను ప‌రిశీలించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశానికి హాజర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఉప ముఖ్య‌మంత్రికి పూల గుచ్ఛం ఇచ్చి సాద‌ర స్వాగ‌తం తెలిపారు. అనంత‌రం చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ముసలి మడుగు ఎలిఫెంట్ క్యాంప్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా అంతటా పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశామ‌న్నారు ఎస్పీ తుషార్ డూడి. ముఖ్యంగా మార్గమధ్యంలో పోలీసు పికెటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే, పర్యటనలో ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, పోలీస్ అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్ల‌డించారు. అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎనిమిది గో డౌన్ల‌ను ప‌రిశీలించారు. వెంట‌నే పూర్తి నివేదిక‌ను అందించాల‌ని ఆదేశించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *