న‌మో అంటే నాయుడు మోదీ : నారా లోకేష్

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోదీ అని అన్నారు. వీరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ స్పీడులో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో మంత్రి లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రానికి రూ. 82,000 కోట్ల ఒప్పందం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని ప్ర‌క‌టించారు నారా లోకేష్‌.

రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ వేదిక‌గా 30వ సీఐఐ ఏపీ భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిర్వ‌హిస్తోంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్ర‌పంచంలోని దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధులు, చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్స్, పెట్టుబ‌డిదారులు, చీఫ్ క‌న్సల్టెంట్స్ , ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు. రూ. 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు రానున్నాయ‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు మంత్రి నారా లోకేష్.

  • Related Posts

    బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం : కోహినూర్ గ్రూప్

    Spread the love

    Spread the loveనాద‌ర్ గుల్ భూములు ప్ర‌భుత్వానివి కావు హైద‌రాబాద్ : నాద‌ర్ గుల్ భూములు క‌బ్జాకు గురైన‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్ రావు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది కోహినూర్ గ్రూప్. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ భూమి…

    స్వ‌ర్ణాంధ్ర ఫౌండేష‌న్ కు ఒప్పో భారీ విరాళం

    Spread the love

    Spread the loveరూ. 50.59 ల‌క్ష‌ల చెక్కును అందించిన ఎండీ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ముందు చూపుతో ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని స్వ‌ర్ణాంధ్ర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *