16న‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో ల‌క్ష కుంకుమార్చ‌న‌

తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 17 నుండి 25వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 16వ తేదీ అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌ కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పుణ్యా‌హ వ‌చ‌నం, ర‌క్షా బంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. ఆలయంలో న‌వంబ‌రు 17న ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.15 నుండి 9.30 గంటల మ‌ధ్య ధనుర్ ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తిరోజూ ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

18వ తేదీ ఉద‌యం పెద్ద శేషవాహనం, రాత్రి హంస వాహనం , 19వ తేదీన ఉద‌యం ముత్యపు పందిరి వాహనం , రాత్రి సింహ వాహ‌నం, 20వ తేదీన ఉద‌యం క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి హ‌నుమంత వాహ‌నం,
21వ తేదీన ఉద‌యం ప‌ల్ల‌కీ ఉత్స‌వం, రాత్రి గ‌జ వాహ‌నం, 22న ఉద‌యం సర్వ భూపాల వాహనం , సాయంత్రం స్వ‌ర్ణ ర‌థం, రాత్రి గరుడ వాహ‌నం, 23న ఉద‌యం సూర్య ప్ర‌భ వాహ‌నం, రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌నం, 24న ఉద‌యం ర‌థోత్స‌వం, రాత్రి అశ్వ వాహ‌నం, 25న ఉద‌యం పంచ‌మీ తీర్థం, రాత్రి ధ్వ‌జావ రోహ‌ణం నిర్వ‌హిస్తారు.

  • Related Posts

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    స‌త్య‌సాయి బాబా జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

    స్ప‌ష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : ఈ భూమి మీద పుట్టిన అద్భుత‌మైన వ్య‌క్తి భ‌గ‌వాన్ శ్రీ స‌త్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *