మంత్రి లోకేష్ తో ఆస్ట్రేలియ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్

Spread the love

కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన మంత్రి , సీజే

విశాఖ‌పట్నం : ఏపీలోని విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం వేదిక‌గా కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన సీఐఐ భాగ‌స్వామ్య స‌దస్సు కొన‌సాగుతోంది. పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స‌ద‌స్సులో భాగంగా ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా-ఇండియా CEO ఫోరమ్ డైరెక్టర్ జోడి మెక్కే , విశాఖపట్నంలోని జేమ్స్ కుక్ విశ్వ విద్యాలయం ప్రతినిధులను కలవడం ఆనందంగా ఉందన్నారు ఈ సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్‌. తీరప్రాంత, సముద్ర పరిశోధన, ఉష్ణ మండల వ్యాధుల అధ్యయనాలు, స్థిరమైన పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని చర్చించ‌డం జ‌రిగింద‌న్నారు.

రాష్ట్రంలో ఉష్ణమండల నీటి పరిశోధన సమూహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, నీటి నిర్వహణలో తమ యువతకు ఉమ్మడి శిక్షణను కూడా ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు చెప్పారు మంత్రి నారా లోకేష్. త‌మ కూట‌మి స‌ర్కార్ రూ. 10 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు ఆక‌ర్షించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. ఆ దిశ‌గా తాము స‌క్సెస్ అయ్యామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో స‌మర్థ‌వంతుడైన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోంద‌ని అన్నారు.

  • Related Posts

    తెలంగాణ అమ‌ర వీరుల‌కు సీఎం నివాళి

    Spread the love

    Spread the loveజూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌర‌వం ఎక్కువ అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్స‌వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా…

    ఇప్ప‌ట్లో ఉద్యోగాలు ఇవ్వ‌లేం : బుర్రా వెంక‌టేశం

    Spread the love

    Spread the love20 జాబ్స్ కోసం 19,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి హైద‌రాబాద్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి బాగో లేద‌ని, అందుకే ఎక్కువ‌గా జాబ్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *