సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

Spread the love

ఉచిత సినిమాల‌ను చూస్తే డేటా చోరీ

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబం కూడా సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డింద‌న్నాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ముఖ్యంగా సిటీ పోలీస్ క‌మిష‌నర్ వీసీ స‌జ్జ‌నార్ ఆధ్వ‌ర్యంలో పోలీసుల‌కే స‌వాల్ గా మారిన ఐబొమ్మ , బొప్పం సంస్థ‌ల నిర్వాహ‌కుడు, అడ్మిన్ ఇమ్మ‌డి ర‌వి కుమార్ ను అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల థ్యాంక్స్ తెలిపారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. 21 వేల‌కు పైగా సినిమానల‌ను అప్ లోడ్ చేయ‌డంతో పాటు రూ. 20 కోట్లు సంపాదించాడ‌ని తెలుసుకుని తాము ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు తెలిపారు.

కానీ వాస్త‌వానికి త‌న నిర్వాకం, చోరీ కార‌ణంగా టాలీవుడే కాదు ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌లు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను కోల్పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అక్కినేని నాగార్జున‌. ఇలాంటి వారి వ‌ల్ల మ‌న డేటా అనుకోకుండా మ‌న‌కు తెలియ‌కుండానే చోరీకి గుర‌వుతుంద‌ని తెలిపాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించాడు న‌టుడు. త‌ను రూ. 20 కోట్లు సంపాదించాడ‌ని సీపీ చెబుతున్నార‌ని కానీ త‌న వ‌ర‌కు మాత్రం ఇమ్మ‌డి ర‌వి ఏకంగా వంద‌ల కోట్లు పోగేసి ఉంటాడ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఏది ఏమైనా ఒక సైబ‌ర్ నేర‌స్తుడు ప‌ట్టుబ‌డ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు అక్కినేని నాగార్జున‌.

  • Related Posts

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    త‌మిళ‌నాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టి స‌న‌మ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *