రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం

Spread the love

రాబోయే కాలం మ‌న‌దేన‌న్న ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని , ప‌ని చేసుకుంటూ పోవాల‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించారు బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి ఓడి పోవ‌డం, డిపాజిట్ రాక పోవ‌డం ప‌ట్ల స్పందించారు. తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే 7 సార్లు అధికార పార్టీనే గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో హ‌స్తం గెలిచింద‌ని అన్నారు ఎంపీ. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టీ మరీ గెలిచారంటూ ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని చేశారో వీరు కూడా అవే చేశారని అన్నారు. కాంగ్రెస్ కి హుజురాబాద్ లో 3016 ఓట్లు వ‌చ్చాయ‌ని, దుబ్బాకలో , మునుగోడు డిపాజిట్ కోల్పోయింద‌న్నారు. మరి డిపాజిటు కోల్పోయిన పార్టీ మొన్న ఎలా అధికారంలోకి వచ్చింది. ఒక్క బై ఎలక్షన్ ఓడిపోగానే బీజేపీ పని అయిపోతుందా ? రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరూ అలా మాట్లాడరని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్.

బీహార్ ఎన్నికలు ఒక ప్రభంజనం అన్నార‌. మ‌హా ఘ‌ట్ బంధ‌న్ అడ్ర‌స్ లేకుండా పోయింద‌న్నారు ఎంపీ.
ఒళ్ళు వంచి పని చేస్తే విజయం మనదే న‌ని ప్ర‌క‌టించారు. కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి బాధ‌కు గురి కావ‌ద్ద‌ని కోరారు . జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం అందరం బాధ్యత తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ప్రజలకు సేవ చేయడం వల్లనే దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్. గెలిస్తే బీజేపీ వాళ్ళు EVM లను ఏదో చేశారని అంటున్నారు.. మరి జూబ్లీహిల్స్ లో ఇవిఎం మేనేజ్ చేశారా ? దొంగ ఓట్లు నమోదు చేయించారా అని ప్ర‌శ్నించారు. తెలంగాణలో, కర్ణాటకలో కూడా మీరే గెలిచారు మరి అక్కడ కూడా అలానే చేశారా ? మీరు గెలిస్తే ఒక న్యాయం.. మేము గెలిస్తే ఓట్ చోరీ అని అంటారా ? ఏం చేస్తావో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. ఇలాంటి ఆరోపణలు కాదు. బరిగీసి కొట్లాడే తత్వం లేనప్పుడు పార్టీ ముందుకు పోయే అవకాశం లేదన్నారు.

  • Related Posts

    కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిపై క‌న్నేసిన సీఎం

    Spread the love

    Spread the loveఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక త‌ను అస‌లు రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని అన్నారు. ప్ర‌జా…

    నీటిని నిల్వ చేయాలి జ‌లాశ‌యాలు నింపాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అనంత‌పురం జిల్లా : స‌మ‌స్త మాన‌వాళికి నీరు అత్యంత ముఖ్య‌మ‌ని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం అనంత‌పురం జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *