త‌ళుక్కుమ‌న్న బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్

వెబ్ సీరీస్ లో సైతం ల‌వ్లీ క్వీన్ హ‌ల్ చ‌ల్

ముంబై : బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. త‌ను సినిమాల నుంచి కొంత దూరం పెరిగినా ఇప్పుడు త‌న రూట్ మార్చింది. ప్రముఖ రియాల్టీ షోల‌లో పాల్గొంటోంది. అంతే కాకుండా త‌ను కీ రోల్ పోషిస్తూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌స్తోంది. ఒక‌ప్పుడు తేజాబ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత 1990 నుంచి 2020 వ‌ర‌కు ఒక ఊపు ఊపింది. త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా సూప‌ర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఒకానొక ద‌శ‌లో హీరోల‌ను ప‌క్క‌న పెట్టి త‌ను రాజ్యం ఏలింది మాధురి దీక్షిత్ నేనే.

ఆ త‌ర్వాత వెబ్ సీరీస్ మీద ఫోక‌స్ పెట్టింది. తాజాగా సంక్రాంతి పండుగ వేళ ఉన్న‌ట్టుండి ఝ‌ల‌క్ ఇచ్చింది. డిఫ‌రెంట్ యాంగిల్స్ లో మాధురి దీక్షిత్ ఫోటో షూట్ చేసింది. త‌న ఫోటోల‌తో పిచ్చెక్కించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వ‌య‌సు మీద ప‌డినా త‌న‌లో అందం ఏ మాత్రం చెద‌ర లేద‌ని నిరూపించింది ఈ అందాల ముద్దుగుమ్మ‌. ఏది ఏమైనా త‌నకంటూ ఎదురే లేద‌ని చాటి చెప్పింది మాధురీ దీక్షిత్ నేనే. ప్ర‌స్తుతం సినిమాల‌లో త‌న‌ను మ‌రోసారి న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప్ర‌స్తుతం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *