ఓవరాల్ ఛాంపియ‌న్స్ కు సీఎం అభినంద‌న

Spread the love

తెలంగాణ ఈఎంఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు కంగ్రాట్స్

హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ కు చెందిన విద్యార్థులు అరుదైన ఘ‌న‌త సాధించారు. ఏకంగా వివిధ విభాగాల‌లో జ‌రిగిన పోటీల‌లో 230 ప‌త‌కాల‌ను సాధించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థులు కలిశారు. వారిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా వారిని ప్ర‌శంస‌లతో ముంచెత్తారు.

అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా తెలంగాణ యువత 230 పతకాలను సాధించడం ప‌ట్ల త‌న‌కు , ప్ర‌భుత్వానికి గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు సీఎం. త‌మ స‌ర్కార్ క్రీడ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని చెప్పారు. పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌త్యేకించి క్రీడా పాల‌సీని కూడా త‌యారు చేస్తున్నామ‌న్నారు. ఆయా విద్యా సంస్థ‌ల బ‌లోపేతానికి కృషి చేస్తున్నామ‌న్నారు.

  • Related Posts

    త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లోనే మ్యాచ్ లు ఆడుతాం

    Spread the love

    Spread the loveఐసీసీకి స్ప‌ష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా తాము ఇండియాలో జ‌రిగే కీల‌క మ్యాచ్ ల‌ను…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 బ‌రువు 6,175 కిలోలు

    Spread the love

    Spread the love18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ త‌యారీ న్యూఢిల్లీ : అమెరికా వేదిక‌గా ఈ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్స‌ర్ చేస్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *