శ్రీ‌వారి భ‌క్తుల‌కు స్వ‌యంగా వ‌డ్డించిన సీఎం

ఎన్టీఆర్ పెట్టిన ట్ర‌స్ట్‌..దేవాన్ష్ విరాళం

తిరుమ‌ల : తిరుమ‌ల లోని శ్రీ‌వారిని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌, నారా బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి, దేవాన్ష్ శ‌నివారం క్యూ కాంప్లెక్స్ ద్వారా ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తుల‌తో ముచ్చ‌టించారు. క్యూ కాంప్లెక్స్‌లో ప్రసాదం పంపిణీ, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలు ఎలా ఉన్నాయో స్వయంగా చూశారు. లోపాలేమైనా ఉంటే వెంటనే సరిదిద్దాల‌ని టీటీడీకి సూచించేందుకు చంద్ర‌బాబు ఇలా క్యూ కాంప్లెక్స్ ద్వారా ద‌ర్శ‌నానికి వెళ‌తారు.

ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు తిరుమల కొండకు వచ్చే భక్తులకు అన్నప్రసాదంతో ఆక‌లి తీరుస్తూనే ఉంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సులో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది. ఈ ట్రస్టుకు తన మనుమడు దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్నారు. దేవాన్ష్ పేరుతో అన్నదానం కోసం 12 సార్లు విరాళం అందించారు. మొత్తంగా ఇప్పటి వరకూ రూ.3.40 కోట్లు అన్నదానం కోసం విరాళంగా అందించడం విశేషం.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *