మెరుగైన పౌర సేవ‌లు అందించాలి : సీఎం

Spread the love

స‌చివాలయంలో స‌మీక్ష చేప‌ట్టిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం తాజాగా తీసుకు వ‌చ్చిన నూత‌న పౌర సేవ‌ల‌కు సంబంధించి ఆరా తీశారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌తాధికారులు, సంబంధిత శాఖ‌లతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది అనేది లేకుండా చూడాల‌ని అన్నారు సీఎం. ప్ర‌త్యేకించి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఫీడ్ బ్యాక్ అనేది అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు . దీని వ‌ల్ల మ‌రింత పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే కూట‌మి స‌ర్కార్ వినూత్న‌మైన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింద‌ని చెప్పారు. మొత్తం పౌర సేవ‌ల‌ను పూర్తిగా మైక్రోసాఫ్ట్ ఆధ్వ‌ర్యంలో వాట్సాప్ ద్వారానే అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు ముఖ్య‌మంత్రి. దీని వ‌ల్ల శ్ర‌మ ఉండ‌ద‌ని, టైం సేవ్ అవుతుంద‌న్నారు. ఏయే శాఖ‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాయో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రి చూసుకోవాల‌ని, ఏ మాత్రం ఇబ్బంది ప‌డినా తాను ఊరుకోనంటూ హెచ్చ‌రించారు నారా చంద్ర‌బాబు నాయుడు. పౌరుల సేవ‌ల‌కు సంబంధించి దేశానికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం రోల్ మోడ‌ల్ కావాల‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ : సీఎం

    Spread the love

    Spread the loveక‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ కు కంగ్రాట్స్ అమ‌రావ‌తి : క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు . గురువారం అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జ‌రిగిన జిల్లాల…

    జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి

    Spread the love

    Spread the loveటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యవిజ‌య‌వాడ : పరకామణి చిన్నకేసు అని అవహేళన చేసిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య . త‌క్ష‌ణ‌మే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *