సీఎం కోడ్ ఉల్లంఘ‌న‌పై ఈసీకి ఫిర్యాదు

Spread the love

క‌మిష‌న‌ర్ ను క‌లిసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నిక‌ల కోడ్ ను విధించింద‌న్నారు. ఈ స‌మ‌యంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం, స‌భలు నిర్వ‌హించ కూడ‌ద‌ని ఆ విష‌యం తెలిసినా ప‌ట్టించు కోవ‌డం లేదంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడ‌మే కాకుండా ప్రభుత్వ ధనం వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను క‌లిశారు క‌విత‌. ఈ సంద‌ర్భంగా విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

మక్తల్, కొత్తగూడెం సభల్లో సర్పంచులుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి పనులు చేయించే వారిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరార‌ని చెప్పారు. ఎన్నికల కోడ్ ను ముఖ్యమంత్రి పూర్తిగా ఉల్లంఘించారంటూ ఆరోపించారు. ప్రజా ధనాన్ని వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిపై ఇదివరకే తెలంగాణ జాగృతి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వచ్చిందని తెలిపారు. నవంబర్ 30వ తేదీన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింద‌ని చెప్పారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి ప్రచారాన్ని నిలుపుదల చేయించాల‌ని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల‌ని ఈసీని కోరారు.

  • Related Posts

    రాష్ట్ర అభివృద్దిపై కూట‌మి స‌ర్కార్ ఫోక‌స్

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : త‌మ ప్ర‌భుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు…

    ప్ర‌తిప‌క్ష నేత‌ను మాట్లాడ‌కుండా చేస్తే ఎలా..?

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న్యూఢిల్లీ : మోదీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేర‌కు ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాన అంశాల‌పై ప్ర‌శ్నించేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *