సీఎం కోడ్ ఉల్లంఘ‌న‌పై ఈసీకి ఫిర్యాదు

Spread the love

క‌మిష‌న‌ర్ ను క‌లిసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నిక‌ల కోడ్ ను విధించింద‌న్నారు. ఈ స‌మ‌యంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం, స‌భలు నిర్వ‌హించ కూడ‌ద‌ని ఆ విష‌యం తెలిసినా ప‌ట్టించు కోవ‌డం లేదంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడ‌మే కాకుండా ప్రభుత్వ ధనం వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను క‌లిశారు క‌విత‌. ఈ సంద‌ర్భంగా విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

మక్తల్, కొత్తగూడెం సభల్లో సర్పంచులుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి పనులు చేయించే వారిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరార‌ని చెప్పారు. ఎన్నికల కోడ్ ను ముఖ్యమంత్రి పూర్తిగా ఉల్లంఘించారంటూ ఆరోపించారు. ప్రజా ధనాన్ని వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిపై ఇదివరకే తెలంగాణ జాగృతి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వచ్చిందని తెలిపారు. నవంబర్ 30వ తేదీన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింద‌ని చెప్పారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి ప్రచారాన్ని నిలుపుదల చేయించాల‌ని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల‌ని ఈసీని కోరారు.

  • Related Posts

    వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చ

    Spread the love

    Spread the loveసీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మీటింగ్ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై…

    ఎస్ఎస్ సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజ‌ల్ట్స్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను ప్రకటించింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు విద్యా శాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *