ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ముఖ్యం

VijayaBhaskar · December 7, 2025
Spread the love

స్ప‌ష్టం చేసిన వెంక‌య్య నాయుడు

హైద‌రాబాద్ : భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని, దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం అని స్ప‌ష్టం చేశారు దేశ మాజీ రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వర‌పు వెంక‌య్య నాయుడు. ఆదివారం ఆంపుటేషన్ ఫ్రీ తెలంగాణ నినాదంతో ప్రజల్లో మధుమేహం దుష్ఫలితాలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన వాకథాన్ ని ప్రారంభించారు . “డాక్టర్ వూండ్” అనువర్తనాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంద‌న్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోగలం అని స్ప‌ష్టం చేశారు వెంక‌య్య నాయుడు. దానితో పాటుగా, మన శరీరంలోని మార్పులు పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా మధుమేహం ఉన్నవారు కూడా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం సాధ్యం అవుతుంద‌న్నారు. ముఖ్యంగా యువత ఉదయాన్నే నిద్ర లేవ‌డం, శారీరక వ్యాయామం చేయడం, ఇష్టమైన ఆట పాటలను ఎంచుకుని సాధన చేయడం ద్వారా ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించవచ్చు అని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు.