కలకలం రేపిన భద్రతా సిబ్బంది నిర్వాకం
తిరుమల : కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతోంది తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ 70 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అయితే చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, ఇద్దరు జేఈవోలతో పాటు భారీ ఎత్తున ఉద్యోగులు నిత్యం పని చేస్తుంటారు. కానీ ఈమధ్యన ఫోటోలు దిగడం, సెల్ఫీలు తీసుకోవడం పరిపాటిగా మారింది. మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఫోటో షూట్ కూడా చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది ప్రపంచ వ్యాప్తంగా. శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు టీటీడీ పాలక మండలిపై. తాజాగా తిరుమలలో నవదంపతుల ప్రవర్తనపై భక్తులు ఫైర్ అవుతున్నారు.
పోలీసులు, విజిలెన్స్ అధికారుల నిష్క్రియాత్మకతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణారాహిత్య ప్రవర్తన భక్తుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఫోటో షూట్ కోసం, ఆ జంట తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు గోళ్ల మండపం సమీపంలో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆలయం వద్ద రీల్స్ చేయడానికి పూర్తి నిషేధం విధించినప్పటికీ, ఆ జంట దానిని పట్టించుకోకుండా రీల్స్ చేశారు. ఈ ఘటనపై స్పందించారు. ఆలయం వద్ద ప్రజలు రీల్స్ చేయకుండా నిరోధించడానికి సంబంధిత అధికారులు ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు.







