తిరుమ‌ల సాక్షిగా న‌వ దంప‌తుల ఫోటో షూట్

క‌ల‌కలం రేపిన భ‌ద్ర‌తా సిబ్బంది నిర్వాకం

తిరుమ‌ల : కోట్లాది మంది భ‌క్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతోంది తిరుమ‌ల. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తి రోజూ 70 వేల మందికి పైగా భ‌క్తులు వ‌స్తుంటారు. అయితే చైర్మ‌న్, ఈవో, అడిష‌న‌ల్ ఈవో, ఇద్ద‌రు జేఈవోల‌తో పాటు భారీ ఎత్తున ఉద్యోగులు నిత్యం ప‌ని చేస్తుంటారు. కానీ ఈమ‌ధ్య‌న ఫోటోలు దిగ‌డం, సెల్ఫీలు తీసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. మ‌రికొంద‌రు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ ఫోటో షూట్ కూడా చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది ప్ర‌పంచ వ్యాప్తంగా. శ్రీ‌వారి భ‌క్తులు పెద్ద ఎత్తున మండిప‌డుతున్నారు టీటీడీ పాల‌క మండ‌లిపై. తాజాగా తిరుమలలో నవదంపతుల ప్రవర్తనపై భక్తులు ఫైర్ అవుతున్నారు.

పోలీసులు, విజిలెన్స్ అధికారుల నిష్క్రియాత్మకతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణారాహిత్య ప్రవర్తన భక్తుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఫోటో షూట్ కోసం, ఆ జంట తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు గోళ్ల మండపం సమీపంలో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆలయం వద్ద రీల్స్ చేయడానికి పూర్తి నిషేధం విధించినప్పటికీ, ఆ జంట దానిని పట్టించుకోకుండా రీల్స్ చేశారు. ఈ ఘటనపై స్పందించారు. ఆలయం వద్ద ప్రజలు రీల్స్ చేయకుండా నిరోధించడానికి సంబంధిత అధికారులు ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *