మ‌హా శివ‌రాత్రికి టీటీడీ ఆల‌యాలు ముస్తాబు

Spread the love

స్ప‌ష్టం చేసిన తిరుప‌తి జిల్లా ఎస్పీ

తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి ఎస్ఓ మురళీకృష్ణ, టిటిడి జేఈవో వీరబ్రహ్మం సంయుక్తంగా ఉన్నతాధికారులతో కలిసి కపిలతీర్థం, అనుబంధ ఆలయాలను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, క్యూలైన్లు , ఇతర మౌలిక వసతులపై క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. అలాగే శ్రీనివాస మంగాపురం, గుడిమల్లం, తదితర ఆలయాలను కూడా సందర్శించి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు తగిన చర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు జేఈవో వీర‌బ్ర‌హ్మం.

  • Related Posts

    తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

    Spread the love

    Spread the loveతండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. ప్ర‌తి రోజూ 80 వేల మందికి పైగా భ‌క్తులు త‌ర‌లి…

    భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

    Spread the love

    Spread the loveగంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *