మ‌హా శివ‌రాత్రికి టీటీడీ ఆల‌యాలు ముస్తాబు

స్ప‌ష్టం చేసిన తిరుప‌తి జిల్లా ఎస్పీ

తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి ఎస్ఓ మురళీకృష్ణ, టిటిడి జేఈవో వీరబ్రహ్మం సంయుక్తంగా ఉన్నతాధికారులతో కలిసి కపిలతీర్థం, అనుబంధ ఆలయాలను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, క్యూలైన్లు , ఇతర మౌలిక వసతులపై క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. అలాగే శ్రీనివాస మంగాపురం, గుడిమల్లం, తదితర ఆలయాలను కూడా సందర్శించి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు తగిన చర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు జేఈవో వీర‌బ్ర‌హ్మం.

  • Related Posts

    సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు

    తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. ఈ విశేష ప‌ర్వ‌దినాల సంద‌ర్బంగా వివిధ ప్రాంతాల నుంచి శ్ర‌మ‌కోర్చి శ్రీ వేంక‌టేశ్వ‌ర…

    వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

    అమ‌రావ‌తి : అమరావతిలోని వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పరిశీలించారు. 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆలయంలోని 2వ ప్రాకారం,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *