తెలంగాణ సీఎస్ గా జ‌యేష్ రంజ‌న్..?

Spread the love

1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి అయిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం సీఎస్ ఉన్న రామ‌కృష్ణా రావు ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. దీంతో త‌దుప‌రి సీఎస్ గా ఎవ‌రు ఎంపిక అవుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా తాజాగా సీనియ‌ర్ ఏఏఎస్ ఆఫీస‌ర్ జ‌యేష్ రంజ‌న్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఆయ‌న ఇప్ప‌టికే కీల‌క‌మైన శాఖ‌ల‌కు ఇంఛార్జ్ గా ఉన్నారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో జ‌యేశ్ చ‌క్రం తిప్పారు. ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన త‌ను అఖిల భారత స్థాయిలో టాపర్ గా నిలిచాడు. ఐఐఎం కోల్ క‌తా, ల కువాన్ యూ స్క‌ల్ ఆఫ్ ప‌బ్లిక్ పాల‌సీలో చ‌దువుకున్నారు. విధాన ఆధారిత పరిపాల‌నా విధానాన్ని అమ‌లు చేయ‌డంలో అనుభ‌వం క‌లిగి ఉన్నారు. ఇటీవలి పరిపాలనా పునర్వ్యవస్థీకరణలలో, జ‌యేష్ రంజన్ డిసెంబర్ 2025లో ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ కు సీఈవోగా విధులు నిర్వ‌హించారు. ఉన్న‌ట్టుండి త‌న‌ను ప‌ట్ట‌ణ అభివృద్ది శాఖ‌కు బ‌దిలీ అయ్యారు.

  • Related Posts

    మామునూరు ఎయిర్ పోర్టు ప‌నులు ప్రారంభించాలి

    Spread the love

    Spread the loveకేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలో కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్…

    మ‌న్రేగా ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రం

    Spread the love

    Spread the loveనిర్వీర్యం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లా : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ఆనాడు కోట్లాది మంది పేద‌ల‌కు అన్నం పెట్టింద‌ని, కూలీల‌కు ప‌ని క‌ల్పించింద‌ని కానీ మోదీ స‌ర్కార్ వ‌చ్చాక దానిని నిర్వీర్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *