శ్రీ‌కాళ‌హ‌స్తి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

మ‌హా శివ‌రాత్రి పండుగ‌కు పండుగ ముస్తాబు

తిరుప‌తి జిల్లా : పంచభూత లింగాల్లో వాయు లింగ క్షేత్రమున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. ధ్వజారోహణ తో మొదలయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాదిగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకున్నారు.

ధ్వజారోహణ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని కోడి స్తంభానికి భక్తులు ముడుపు చీరలను మొక్కుకుంటారు. కోడి స్తంభానికి ధ్వజారోహణ సమయంలో భక్తులు ఇచ్చిన చీరలను కొడిస్తంభానికి అలంకరించడం ఇక్క‌డ ఆన‌వాయితీగా వ‌స్తోంది. ధ్వజారోహణ కార్యక్రమంలో భక్తులు హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ అంటూ శివనామస్మరణలు ఆలయంలో మారు మృగాయి. అత్యంత వైభవంగా స్వామి వారి ధ్వజారోహణ కార్యక్రమం ఆలయ అధికారులు నిర్వహించారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *