newsseals.com
News

మ‌న్రేగా ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రం

VijayaBhaskar February 12, 2026
newsseals-YSSharmilaReddy
Spread the love

నిర్వీర్యం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

నెల్లూరు జిల్లా : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ఆనాడు కోట్లాది మంది పేద‌ల‌కు అన్నం పెట్టింద‌ని, కూలీల‌కు ప‌ని క‌ల్పించింద‌ని కానీ మోదీ స‌ర్కార్ వ‌చ్చాక దానిని నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు షర్మిలా రెడ్డి. త‌న తండ్రి వైఎస్ఆర్ హ‌యాంలో అనంత‌పురం జిల్లాలో ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. ఆనాటి నుంచి నేటి దాకా కోట్లాది మంది పేద‌ల‌తో ఈ ప‌థ‌కం అనుబంధం పెన వేసుకున్న‌ద‌ని చెప్పారు.

రాష్ట్ర గ్రామీణ అభివృద్ధికి మన్రేగా ఎంతో దోహదం చేసిందన్నారు. రాష్ట్రంలో YSR హయాంలో 1.10 కోట్ల జాబ్ కార్డులు ఉండేవ‌ని అన్నారు. కరువు పని తో రాష్ట్రంలో వలసలు తగ్గాయని, కరువు పని జరిగే చోట జ్యూస్ లు కూడా ఇచ్చేవాళ్ళు అని చెప్పారు. కరువు పనికి పోయే వాళ్లకు ఆటో చార్జీలు కూడా ఇచ్చే వాళ్ళని పేర్కొన్నారు. నేడు కరువు పనిని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేసిందన్నారు. పేదవాడి పొట్ట గొట్టాలని కుట్రలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ తెచ్చిన పథకం అని చెప్పి మోదీ కుట్రలు చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి లేకుండా ఎత్తేయాలని చూస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.