శ్రీ‌కాళ‌హ‌స్తి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

Spread the love

మ‌హా శివ‌రాత్రి పండుగ‌కు పండుగ ముస్తాబు

తిరుప‌తి జిల్లా : పంచభూత లింగాల్లో వాయు లింగ క్షేత్రమున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. ధ్వజారోహణ తో మొదలయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాదిగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకున్నారు.

ధ్వజారోహణ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని కోడి స్తంభానికి భక్తులు ముడుపు చీరలను మొక్కుకుంటారు. కోడి స్తంభానికి ధ్వజారోహణ సమయంలో భక్తులు ఇచ్చిన చీరలను కొడిస్తంభానికి అలంకరించడం ఇక్క‌డ ఆన‌వాయితీగా వ‌స్తోంది. ధ్వజారోహణ కార్యక్రమంలో భక్తులు హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ అంటూ శివనామస్మరణలు ఆలయంలో మారు మృగాయి. అత్యంత వైభవంగా స్వామి వారి ధ్వజారోహణ కార్యక్రమం ఆలయ అధికారులు నిర్వహించారు.

  • Related Posts

    శివ స్వాముల కోసం స్పెష‌ల్ స‌ర్వీసులు

    Spread the love

    Spread the loveతెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ హైద‌రాబాద్ : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. భ‌క్తుల కోసం ఇబ్బందులు లేకుండా 2,432 స్పెష‌ల్ బ‌స్సులు…

    భ‌క్త సందోహం మ‌హా శివ‌రాత్రి పుణ్య‌క్షేత్రం

    Spread the love

    Spread the love2 ల‌క్ష‌ల మందికి పైగా ద‌ర్శించుకున్న భ‌క్తులు నంద్యాల జిల్లా : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా భ‌క్తులు పోటెత్తారు. ప్రారంభం నుంచి నేటి దాకా 2 ల‌క్ష‌ల 50 వేల మందికి పైగా ద‌ర్శించుకున్నారు .ఈ విష‌యాన్ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *