సంజూ శాంస‌న్ పై ర‌విచంద్ర‌న్ అశ్విన్ కామెంట్స్

Spread the love

త‌ను సెంచ‌రీ చేస్తే చూడాల‌ని ఉంద‌న్న క్రికెట‌ర్

చెన్నై : భార‌త క్రికెట‌ర్, అనలిస్ట్ , పాడ్ కాస్ట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి. తాజాగా భార‌త్ , శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీ వేదిక‌గా న‌మీబియాతో కీల‌క మ్యాచ్ జ‌రిగింది. త‌ను కేవ‌లం 8 బంతులు మాత్ర‌మే ఆడి 22 ర‌న్స్ చేశాడు. ఇదే మ్యాచ్ లో ఇషాన్ కిష‌న్ , పాండ్యా, శివ‌మ్ దూబేలు దుమ్ము రేపారు. ఆ త‌ర్వాత భార‌త్ జ‌ట్టు బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో ఇండియా గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. కాగా శాంస‌న్ కు అనూహ్యంగా ఛాన్స్ ద‌క్కింది. త‌ను స్వ‌దేశంలో జ‌రిగిన న్యూజిలాండ్ టి20 సీరీస్ లో 5 మ్యాచ్ లు ఆడాడు . కేవ‌లం 50 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.

దీంతో త‌న‌ను పూర్తిగా త‌ప్పించాడు హెడ్ కోచ్ గంభీర్. తొలి మ్యాచ్ భార‌త జ‌ట్టు అమెరికాతో త‌ల‌ప‌డింది. అభిషేక్ శ‌ర్మ ఆశించిన మేర ఆడ‌లేదు. ఇండియా 9 వికెట్లు కోల్పోయి 161 ర‌న్స్ చేసింది. ముప్పు తిప్ప‌లు పెట్టింది ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు. కెప్టెన్ సూర్య దుమ్ము రేపాడు. ఎట్ట‌కేల‌కు ఇండియా 24 ర‌న్స్ తో గెలుపొందింది. ఈ త‌రుణంలో అభిషేక్ శ‌ర్మ గాయ‌ప‌డ‌డంతో రెండో మ్యాచ్ లో సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ద‌క్కింది. దీనిపై స్పందించాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్. త‌ను టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెంచ‌రీ చేస్తే చూడాల‌ని ఉంద‌న్నాడు.

  • Related Posts

    క‌లిసికట్టుగా ఆడాం న‌మీబియాపై గెలిచాం

    Spread the love

    Spread the loveభార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. న్యూజిలాండ్ సీరీస్…

    అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ కంగ్రాట్స్

    Spread the love

    Spread the loveభార‌త్ తో ఓడి పోయినా బాగా ఆడార‌ని కితాబు అమెరికా : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. త‌న స్వంత సామాజిక మాధ్య‌మం ట్రూత్ సోష‌ల్ వేదిక‌గా ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *