క‌లిసికట్టుగా ఆడాం న‌మీబియాపై గెలిచాం

భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. న్యూజిలాండ్ సీరీస్ లో నిరాశ ప‌రిచిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో తీసుకున్నారు. ఓపెన‌ర్ గా బ‌రిలోకి తొలి మ్యాచ్ లో ఆడిన స్టార్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ అనారోగ్యానికి గురి కావ‌డంతో త‌న స్థానంలో సంజూ వ‌చ్చాడు. వ‌చ్చీ రావ‌డంతోనే కేవ‌లం 8 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 22 ర‌న్స్ చేశాడు. మ‌రో వైపు ఇషాన్ కిషాన్ రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. న‌మీబియా బౌలర్ల‌ను ఊచ‌కోత కోశాడు.

ఆ సూర్య‌, హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడారు. మ్యాచ్ గెలుపొందిన అనంత‌రం సూర్య కుమార్ యాద‌వ్ మీడియాతో మాట్లాడాడు. ఇది సుల‌భ‌మైన వికెట్ కాద‌ని అన్నాడు. అయితే ఇషాన్ కిష‌న్ , శాంస‌న్ ప్రారంభించిన విధానం బాగుంద‌న్నాడు. శివ‌మ్ దూబే, పాండ్యా ఆడిన విధానం సూప‌ర్ అని పేర్కొన్నాడు కెప్టెన్. ఇది జ‌ట్టుకు శుభ సూచ‌కం అని చెప్పాడు. ఇక నుంచి త‌మ‌కు ప్ర‌తి మ్యాచ్ చాలా ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశాడు. రాబోయే రోజుల్లో తాము ప్ర‌తి మ్యాచ్ ను గెలుపొందాల‌ని తాము ఆడుతామ‌ని చెప్పాడు సూర్య కుమార్ యాద‌వ్.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *