క‌లిసికట్టుగా ఆడాం న‌మీబియాపై గెలిచాం

Spread the love

భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. న్యూజిలాండ్ సీరీస్ లో నిరాశ ప‌రిచిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో తీసుకున్నారు. ఓపెన‌ర్ గా బ‌రిలోకి తొలి మ్యాచ్ లో ఆడిన స్టార్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ అనారోగ్యానికి గురి కావ‌డంతో త‌న స్థానంలో సంజూ వ‌చ్చాడు. వ‌చ్చీ రావ‌డంతోనే కేవ‌లం 8 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 22 ర‌న్స్ చేశాడు. మ‌రో వైపు ఇషాన్ కిషాన్ రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. న‌మీబియా బౌలర్ల‌ను ఊచ‌కోత కోశాడు.

ఆ సూర్య‌, హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడారు. మ్యాచ్ గెలుపొందిన అనంత‌రం సూర్య కుమార్ యాద‌వ్ మీడియాతో మాట్లాడాడు. ఇది సుల‌భ‌మైన వికెట్ కాద‌ని అన్నాడు. అయితే ఇషాన్ కిష‌న్ , శాంస‌న్ ప్రారంభించిన విధానం బాగుంద‌న్నాడు. శివ‌మ్ దూబే, పాండ్యా ఆడిన విధానం సూప‌ర్ అని పేర్కొన్నాడు కెప్టెన్. ఇది జ‌ట్టుకు శుభ సూచ‌కం అని చెప్పాడు. ఇక నుంచి త‌మ‌కు ప్ర‌తి మ్యాచ్ చాలా ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశాడు. రాబోయే రోజుల్లో తాము ప్ర‌తి మ్యాచ్ ను గెలుపొందాల‌ని తాము ఆడుతామ‌ని చెప్పాడు సూర్య కుమార్ యాద‌వ్.

  • Related Posts

    సంజూ శాంస‌న్ పై ర‌విచంద్ర‌న్ అశ్విన్ కామెంట్స్

    Spread the love

    Spread the loveత‌ను సెంచ‌రీ చేస్తే చూడాల‌ని ఉంద‌న్న క్రికెట‌ర్ చెన్నై : భార‌త క్రికెట‌ర్, అనలిస్ట్ , పాడ్ కాస్ట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి. తాజాగా భార‌త్ ,…

    అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ కంగ్రాట్స్

    Spread the love

    Spread the loveభార‌త్ తో ఓడి పోయినా బాగా ఆడార‌ని కితాబు అమెరికా : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. త‌న స్వంత సామాజిక మాధ్య‌మం ట్రూత్ సోష‌ల్ వేదిక‌గా ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *