క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Spread the love

బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని భరోసా

అమ‌రావ‌తి : కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించి పోయారు. ⁠విస్ఫోటన ఘటనకుగల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు, వైద్య సిబ్బందిని అడిగి మృతులు, క్షతగాత్రుల వివరాలు ఆరా తీశారు పవన్ కళ్యాణ్ .ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు మృతి చెంద‌డం ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మ‌రో వైపు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు సైతం బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా ఉండ‌గా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బందిని ఆదేశించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

  • Related Posts

    గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ గా రాయ‌ల‌సీమ‌

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.…

    విమాన‌యాన ప్ర‌యాణీకుల భద్ర‌త కీల‌కం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదాయం కంటే విమాన రంగంలో భ‌ద్ర‌త అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో మారుతున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *