వెలుగుమ‌ట్ల బాధితులకు న్యాయం జ‌ర‌గాలి : క‌విత

Spread the love

ఇండ్లను కూలగొట్టారో అక్కడే ఇళ్లు క‌ట్టించి ఇవ్వాలి

ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె రాష్ట్ర స‌ర్కార్ తీసుకున్న అప్ర‌జాస్వామిక చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఖ‌మ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఎక్కడైతే బుల్డోజర్లతో ఇండ్లను కూలగొట్టారో అక్కడే ప్రభుత్వం ఇండ్లను కట్టించి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అన్యాయంగా పేద‌ల ఇళ్లు కూల్చి వేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. బాధితుల‌కు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. వారికి సంఘీభావంగా క‌విత నిరాహార‌దీక్ష చేప‌ట్టారు. ప్ర‌భుత్వం దిగి వ‌చ్చేంత వ‌ర‌కు తాము దీక్ష విర‌మించేది లేద‌న్నారు. దీంతో ఆమెను అర్ద‌రాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇదిలా ఉండ‌గా ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో మంగళవారం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారంద‌రినీ పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా ముందస్తు అనుమతి లేకుండా నిరసన తెలిపినందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 41 కింద నోటీసులు అందజేశారు. అనంత‌రం స్వంత పూచీ క‌త్తుపై విడుద‌ల చేశారు.

  • Related Posts

    పోలీసుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం : సీఎం

    Spread the love

    Spread the loveపోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమం హైద‌రాబాద్ : స‌మాజం కోసం నిరంత‌రం సేవ‌లు అందిస్తున్న వారిలో పోలీసుల పాత్ర కీల‌క‌మైన‌ద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. హైద‌రాబాద్ లోని పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీస్…

    హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

    Spread the love

    Spread the loveఅందాయ‌న్న వ‌ర్ల పాప‌య్య హైద‌రాబాద్ : హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి 32 ఫిర్యాదులు అందిన‌ట్లు వెల్ల‌డించారు అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్య‌. ఆక్ర‌మ‌ణ‌దారుల క‌బ్జాల గురించి వాపోయారు బాధితులు. త‌మ‌కు వారి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *