దేశ వ్యాప్తంగా దూసుకు పోతున్న మూవీ
ముంబై : డైనమిక్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన చిత్రం దురంధర్ -2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్ బీర్ కపూర్ మరోసారి తన అసమాన నటన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. దురంధర్ -1 ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ వర్గాలను , ప్రత్యేకించి ఆయా చిత్ర పరిశ్రమలను షేక్ చేసింది. ఇదే క్రమంలో దురంధర్ -1 బిగ్ సక్సెస్ కావడంతో నిర్మాతలు, దర్శకుడు మరోసారి ధైర్యం చేశాడు. ఈ సందర్బంగా దుర్భంధర్ -2ను తెరకెక్కించాడు ఆదిత్య ధర్.
తాజాగా ప్రపంచ వ్యాప్తంగా దురంధర్ -2 మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్ల పండుగ కావడంతో చిత్ర నిర్మాతలు, దర్శకుడు సంతోషానికి గురవుతున్నారు. ఎవరూ ఊహించని రీతిలో రికార్డులను బ్రేక్ చేస్తూ పోతోంది. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు పెంచేసిన దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి తనదైన మార్క్ తో దురంధర్ -2ను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఒక్కో పాత్రను అద్భుతంగా చిత్రీకరించాడు . అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.






