ఇళ్ల ల‌బ్దిదారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

ఉగాది ప‌ర్వ దినాన సీం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌రు కూడా ఇల్లు లేదని బాధ ప‌డ‌కూడ‌ద‌ని, ఆ దిశ‌గా ఇళ్లు త్వ‌రిత‌గ‌తిన నిర్మించేందుకు తాము ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు కింది స్థాయి వ‌ర‌కు వెళ్లేలా అధికారులు స‌మన్వ‌యం చేసుకుంటూ ముందుకు వెళుతున్నార‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ల‌బ్దిదారులు త‌మ ఇళ్ల‌లోకి గృహ ప్ర‌వేశం చేయించేలా చేస్తామ‌న్నారు సీఎం.

గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి, ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి వాళ్ల దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని గౌరవ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని చెప్పారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్దిదారులకు అందించి, గృహ ప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పట్టణాభివృద్ధి శాఖపై క్యాంప్ కార్యాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పీ నారాయణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *