రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా ప‌థ‌కం

Spread the love

శాస‌న స‌భ‌లో ప్ర‌క‌టించిన ఉప ముఖ్య‌మంత్రి

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. శుక్ర‌వారం రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శాస‌న స‌భ‌లో బ‌డ్జెట్ 2026-27ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా గోదావ‌రి పుష్క‌రాల‌కు రూ. 500 కోట్లు కేటాయించామ‌న్నారు. ఇదే స‌మ‌య‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమ‌లు చేస్తామ‌న్నారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలలో ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల జీవిత బీమాను అందించే లక్ష్యంతో ప‌ని చేస్తామ‌న్నారు. ఈ ప‌థ‌కం జూన్ 2 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ప్రవేశ పెడుతోందని ప్ర‌క‌టించారు.

తెలంగాణలో జన్మించడం, ఇక్కడ జీవించడం ఒక వరంగా మారే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తగిన సౌకర్యాలను కల్పిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం భద్రతను కల్పిస్తుందన్నారు. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబం అనుభవించే మానసిక వేదన ఒక వైపు ఉంటే, వారు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరో వైపు ఉంటుందన‌న్నారు. ఒక్క దుర్ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ బిడ్డలెవరూ అటువంటి భయం, అభద్రతలతో జీవించ కూడదన్నదే ఈ ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.

  • Related Posts

    గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

    Spread the love

    Spread the loveశాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన డిప్యూటీ సీఎం హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు శాస‌న స‌భ సాక్షిగా. పుష్కరాల…

    ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో స‌ర్కార్ వివ‌క్ష‌

    Spread the love

    Spread the loveఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ స‌ర్కార్ తీరుపై భ‌గ్గుమ‌న్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *