గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన డిప్యూటీ సీఎం

హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు శాస‌న స‌భ సాక్షిగా. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత , జనసమూహ నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. జూన్ 26 నుండి జూలై 7 వరకు అత్యంత పవిత్రమైన గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ నిధుల‌ను ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింద‌న్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

ఈ పవిత్ర కాలంలో సుమారు ఎనిమిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, కుంభమేళా తరహాలో, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా పుష్కరాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే రహదారుల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి వంటి సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనను పర్యవేక్షించేందుకు, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు భ‌ట్టి విక్ర‌మార్క‌. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత , జనసమూహ నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *