భక్తులకు స్వయంగా వడ్డించిన భువనేశ్వరి
తిరుమల : కోట్లాది మందికి ఇష్ట దైవంగా పేరు పొందిన తిరుమల పుణ్య క్షేత్రాన్ని శనివారం సందర్శించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం. బాబుతో పాటు కొడుకు, మంత్రి నారా లోకేష్, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి, చైర్మన్ నారా భువనేశ్వరి. శనివారం తమ మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు కావడంతో ప్రతి ఏటా దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ స్వామి వారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
దేవాన్ష్ పుట్టిన రోజు సందర్బంగగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుని ఆ స్వామి ఆశీర్వాదాలను అందుకున్నారు చంద్రబాబు, కుటుంబీకులు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈసారి కూడా అన్నదానం కోసం ఒక రోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను శ్రీవారి అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందించారు. దేవాన్ష్ తో సహా కుటుంబ సభ్యులందరూ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. భక్తులకు తన చేతితో అన్నం వడ్డించడం ఆనందంగా ఉందన్నారు నారా భువనేశ్వరి .





