క్షతగాత్రులకు వైద్య సాయం అందించాలి
మార్కాపురం జిల్లా : రాయవరం వద్ద గురువార తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచి వేసిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం అని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు సీఎం.
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఒక లారీ ప్రైవేట్ ప్రయాణీకుల బస్సును ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు వేగంగా ఆ రెండు వాహనాలను చుట్టుముట్టాయి. 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
నిర్మల్ ,జగిత్యాల జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘటన సంభవించిన సమయంలో, బాధితులు , వారి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతాల నుండే ప్రయాణిస్తున్నారు.





