newsseals.com
News

మార్కాపురం బ‌స్సు ప్ర‌మాదం బాధాక‌రం

VijayaBhaskar March 26, 2026
newsseals-GottiatiRavikumar
Spread the love

సంతాపం వ్య‌క్తం చేసిన మంత్రి గొట్టిపాటి

అమ‌రావ‌తి : మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నిర్మ‌ల్ నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును అతి వేగంగా వ‌స్తున్న టిప్ప‌ర్ ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల‌లో మంట‌లు చెల‌రేగాయి. బ‌స్సులో ప్ర‌యాణం చేస్తున్న వారిలో 14 మంది ప్ర‌యాణీకులు సజీవ ద‌హ‌నం అయ్యారని ప్రాథ‌మిక స‌మాచారం. ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌తాధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ప‌ట్ల మంత్రులు గొట్టిపాటి ర‌వికుమార్, నారా లోకేష్ లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రమాద ఘటన పై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ప్రమాద వివరాలను మంత్రి గొట్టిపాటికి వివరించారు అధికారులు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ హామీ ఇచ్చారు.