చిన్నారుల కోసం ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కం

Spread the love

తొలి ముద్ద పేరుతో సీఎం ప్రారంభం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. విద్యా శాఖ‌లో కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే ఆయా స్కూల్స్, గురుకులాల‌తో పాటు అంగ‌న్వాడీల‌లో కూడా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టింది. ఇదే శాఖ‌ను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్య‌ధికంగా నిధులు కేటాయించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విజ‌య‌వంత‌గా న‌డుస్తున్న అంగ‌న్వాడీ కేంద్రాల‌కు తీపి క‌బురు చెప్పారు. ఇందులో చ‌దువుకుంటున్న చిన్నారుల ఆక‌లిని తీర్చేందుకు న‌డుం బిగించారు.

ఈ మేర‌కు తొలి ముద్ద అనే పేరుతో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించారు. దీనిని బ్రేక్ ఫాస్ట్ స్కీం అని పేరు పెట్టారు. మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌ల‌తో క‌లిసి స‌చివాల‌యంలో ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న ఆలోచనతో ఈ పథకం ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు సీఎం. మా ఆలోచన ఎంత మంచిదైనా, అంగన్వాడీ లు దానిని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయన్నారు ఈ సంద‌ర్బంగా. అంగన్వాడీ లు త‌మ‌ ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు అని అన్నారు. వారి సమస్యల పై మాకు అవగాహన ఉందన్నారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు వచ్చినా మాకు మొదట గుర్తుకు వచ్చేది అంగన్వాడీ లే.న‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జ‌ర్న‌లిస్టులు ఏపీ స‌ర్కార్ కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఉమ్మడి ఏపీలో మండల రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇవ్వడం తెలుగుదేశం…

    ఉగ్ర కదలికల పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ చీఫ్ మాధ‌వ్ అమ‌రావ‌తి : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉగ్ర క‌ద‌లిక‌ల ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *