అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

Spread the love

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తో కీల‌క పోరు

గౌహ‌తి : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది గౌహ‌తి. ఇప్ప‌టికే టోర్నీలో భాగంగా రెండు మ్యాచ్ లు పూర్త‌య్యాయి. తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ను ఓడించింది. ఇక రెండో మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ చేతిలో అజింక్యా ర‌హానే సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ప‌రాజ‌యం పొందింది. ఇక కీల‌క‌మైన మ‌రో లీగ్ మ్యాచ్ ఇవాళ రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ రియాన్ ప‌రాగ్ నేతృత్వంలోని రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది.

గ‌త కొన్నేళ్లుగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తూ వ‌చ్చాడు స్టార్ కేర‌ళ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. ఇదే క్ర‌మంలో ఊహించని విధంగాను త‌ను ఆ జ‌ట్టును వ‌దిలి పెట్టాడు. ట్రేడింగ్ లో త‌న‌ను సీఎస్కే యాజ‌మాన్యం తీసుకుంది. త‌మ జ‌ట్టు నుంచి కీల‌క‌మైన ఇద్ద‌రు క్రికెట‌ర్లు సామ్ క‌ర‌ణ్ , ర‌వీంద్ర జ‌డేజాల‌ను వ‌దులుకుంది. ఏకంగా సంజు శాంస‌న్ ను రూ. 18 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇవాళ జ‌రిగే మ్యాచ్ అత్యంత కీల‌కం కానుంది శాంస‌న్ కు. ఎలా ఆడ‌తాడ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డ్

    Spread the love

    Spread the love237 .31 స్ట్రైక్ రేట్ తో 776 ప‌రుగులు చేసిన యంగ్ క్రికెట‌ర్ బీహార్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో వండ‌ర్ కిడ్ వైబ‌వ్ సూర్య‌వంశీ అరుదైన రికార్డు సాధించాడు. త‌ను ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు.…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ వైపు పాండ్యా చూపు

    Spread the love

    Spread the loveఇత‌ర జ‌ట్ల లోకి వెళ్లేందుకు నిరాక‌ర‌ణ ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. త‌ను కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే ఇండియ‌న్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *