ఆర్సీబీతో ఓడి పోవ‌డం బాధాక‌రం

VijayaBhaskar · May 11, 2026
Spread the love

ఆవేద‌న వ్య‌క్తం చేసిన రోహిత్ శ‌ర్మ

రాయ్ పూర్ : క‌ర్ణాట‌క లోని రాయ్ పూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో 2 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి బంతి దాకా ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేని స్థితి. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్క‌డా సంయ‌మ‌నం కోల్పోకుండా కృనాల్ పాండ్యా ఆడిన తీరు ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకునేలా చేసింది. మ‌రో వైపు టోర్నీ ప్రారంభంలో తీవ్ర నిరాశ‌కు గురి చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్పుడు త‌దుప‌రి మ్యాచ్ ల‌లో విజ‌యం సాధిస్తూ ప్లే ఆఫ్స్ వైపు దూసుకు పోతోంది.

ఈ త‌రుణంలో ఆర్సీబీతో ప‌రాజ‌యం అనంత‌రం హిట్ మ్యాన్, మాజీ భార‌త జ‌ట్టు, ముంబై ఇండియ‌న్స్ స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. నిస్సందేహంగా, ఇది మాకు నిరాశ కలిగించే ఓటమి. మ్యాచ్ దాదాపు మా చేతిలోకి వచ్చేసింది, చివరికి మేము 100% గెలిచి ఉండాల్సింది. కానీ నిజాయితీగా చెప్పాలంటే, మేము ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధగా అనిపిస్తోందని అన్నాడు. మేము ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేసి ఉండాల్సింది. ఏది ఏమైనా, ఇరు జట్లు చాలా బాగా ఆడాయి . అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచాయి. ఇలాంటి మ్యాచ్‌లు క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్పాడు.