తమిళ‌నాడు కేబినెట్ లో మ‌రో ఇద్ద‌రికి చోటు

Spread the love

ప్ర‌మాణ స్వీకారం చేసిన వ‌న్ని అర‌సు, షాజ‌హాన్
చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ త‌న మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. ఇప్ప‌టికే 23 మందిని తీసుకున్నారు. వారిలో 21 మంది టీవీకే పార్టీకి చెందిన వారు ఉండ‌గా ఇంకో ఇద్ద‌రు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మంత్రులుగా కొలువు తీరారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ పార్టీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలిపిన వీసీకే పార్టీ, ముస్లిం లీగ్ పార్టీల‌ను కూడా కేబినెట్ లో చేరాల‌ని కోరారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

ఆయ‌న కోరిక‌ను మ‌న్నించాయి ఆయా పార్టీలు. ఈ మేర‌కు కీల‌క స‌మావేశం నిర్వ‌హించి తాము కూడా కేబినెట్ లో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ప్రధాన సచివాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారై మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. రాజేష్ కుమార్ , పి. విశ్వనాథన్, విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీకి చెందిన వన్ని అరసు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఏ.ఎం.ఎం. షాజహాన్ క‌లిశారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం విజ‌య్.

  • Related Posts

    ప్రపంచంతో పోటీపడే ఎకో సిస్టమ్ నిర్మాణం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్, డ్రోన్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, అధునాతన తయారీ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తోంద‌ని చెప్పారు…

    వైఎస్ జగన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్ : నిమ్మ‌ల

    Spread the love

    Spread the loveమావిగ‌న్ అంటే జ‌నం జ‌డుసుకుంటున్నారు అమ‌రావ‌తి : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *