తమిళనాడు రాష్ట్ర మంత్రి అధవ అర్జున
చెన్నై : తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. ఒక సంకీర్ణ ప్రభుత్వంగా తాము ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. తాము ప్రజా పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా DMK , AIADMK నెలకొల్పిన రాజకీయ ధోరణి ఇప్పుడు ఇకపై చెల్లుబాటు కాదన్నారు అధవ అర్జున. మా మంత్రివర్గంలో IUML, VCK భాగస్వామ్యం కలిగి ఉన్నాయన్నారు. ఇది పెరియార్ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.
తమ సర్కార్ పై A. రాజా చేసిన ట్వీట్ ఖండించదగినదని పేర్కొన్నారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లప్పుడూ మహిళల హక్కుల కోసం గళం వినిపించే కనిమొళి, తన పార్టీ సభ్యులు మహిళలను గౌరవించేలా ఆదేశించాలని కోరారు. మహిళలను లక్ష్యంగా చేసుకుంటూ చేసిన వ్యాఖ్యల ద్వారా తిరుమావలవన్ను కించపరిచే రీతిలో చేసిన ఆ ట్వీట్ ఏమాత్రం ఆమోద యోగ్యం కాదనన్నారు. నేను గవర్నర్తో మాట్లాడానని అన్నారు, ముఖ్యమంత్రి విజయ్ కూడా గవర్నర్తో మాట్లాడారు. అయితే, లోక్ భవన్లో అనుసరించే నిబంధనల ప్రకారం, వందేమాతరం, జాతీయ గీతానికి సంబంధించిన ప్రోటోకాల్ను వారు తప్పక పాటించాలన్నారు.





