ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సీబీఎన్ బ్రాండ్ అంబాసిడ‌ర్

స్ప‌ష్టం చేసిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్

నంద్యాల జిల్లా : పెట్టుబ‌డుల సాధ‌న‌, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌, ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఏపీ విజ‌యానికి ముఖ్య‌మైన మూడు కార‌ణాలున్నాయని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్ర‌వారం జ‌మ్ముల మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఇప్పుడు మేము ఎంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు రాగలం?” అని అడుగుతున్నారు. ఎందుకంటే, ఇచ్చిన మాటను చేతల్లో చూపే నాయకత్వంతో నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ నేడు ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌. మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను నమ్ముతాం అన్నారు.

నిర్ణయాలు వేగంగా తీసుకుని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసినప్పుడే విధానాలకు విలువ ఉంటుందన్నారు నారా లోకేష్‌. ఈ ప్రాజెక్టే అందుకు నిదర్శనం. ప్రాజెక్ట్ భూమిపూజ నుండి ప్రారంభోత్సవం వరకు రికార్డు స్థాయిలో 11 నెలల్లో పూర్తయిందన్నారు. మూడవది డ‌బుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ స‌ర్కార్‌. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానం మరింత వేగవంతమైందని అన్నారు. మాది డబుల్-ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు కేంద్ర ప్ర‌భుత్వ‌ మద్దతు తోడైన‌ప్పుడు అభివృద్ధి ప‌రుగులు పెడుతుందని చెప్పారు నారా లోకేష్‌.

  • Related Posts

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *